ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరికి రూ..60,000 స్కాలర్షిప్.. వెంటనే అప్లై చేయండి
కొవిడ్ స్కాలర్షిప్
ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఫౌండేషన్ - 'కొవిడ్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్'ను ప్రకటించింది. కొవిడ్తో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థుల కోసం దీనిని ప్రత్యేకించారు.
అర్హత: ఒకటో తరగతి నుంచి ఇంటర్/ పన్నెండోతరగతి/ సాధారణ డిగ్రీ/ ప్రొఫెషనల్ డిగ్రీల వరకు చదువుతున్న వారు అప్లయ్ చేసుకోవచ్చు. కుటుంబ వార్షికాదాయం రూ.6లక్షలకు మించకూడదు. సంస్థ ఉద్యోగుల పిల్లలు దర ఖాస్తుకు అనర్హులు.
స్కాలర్షిప్ : ఒకటోతరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ఏడాదికి రూ.24,000; తొమ్మిదోతరగతి నుంచి ఇంటర్/ పన్నెండో తరగతి వరకు చదువుతున్నవా రికి ఏడాదికి రూ.30,000 ఇస్తారు. సాధారణ డిగ్రీ చదివేవా రికి రూ.36,000; ప్రొఫెషనల్ డిగ్రీలు చేసేవారికి రూ.60,000 ఇస్తారు. తరగతి/ కోర్సును అనుసరించి సంబం ధిత మొత్తాన్ని విద్యార్థి బ్యాంక్ అకౌంట్లో ఒకేసారి జమ చేస్తారు. ఈ మొత్తాన్ని విద్యార్థులు ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, భోజనం, ఇంటర్నెట్, స్టేషనరీ, ఆన్లైన్ లెర్నింగ్ ఖర్చుల నిమిత్తం వినియోగించుకోవాల్సి ఉంటుంది. విద్యా ర్థులకు వారి అవసరం మేరకు లైఫ్ స్కిల్ సెషన్స్, కెరీర్ గైడెన్స్, కౌన్సెలింగ్ వంటివి నిర్వహిస్తారు.
ఎంపిక: వచ్చిన దరఖాస్తులు పరిశీలించి విద్యార్థుల పరిస్థి తిని అంచనావేసి షార్టిస్ట్ రూపొందిస్తారు. తరవాత టెలి ఫోనిక్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ నిర్వహించి అర్హులకు అవకాశం కల్పిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబరు 10
వెబ్సైట్: www.b4s.in/a/ABCC1
Comments
Post a Comment