నర్సు పోస్టులు 4,722 , ఖాళీల భర్తీకి వారంలోగా నోటిఫికేషన్
నర్సింగ్ విద్యార్థులకు తీపి కబురు. నర్సు పోస్టుల భర్తీకి ఐదేళ్ల తర్వాత రంగం సిద్ధమైంది. ఏకంగా 4,722 నర్సు పోస్టుల భర్తీకి తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహె చ్ఎస్ఆర్డీ) వారంలోగా నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తయింది. ఈ పోస్టులన్నీ రాత పరీక్ష ద్వారానే భర్తీ చేయను న్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న నర్సులకు వెయిటేజీ మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. పరీక్ష నిర్వహణ బాధ్యతను జేఎన్టీయూకు అప్పగించే అవకాశాలున్నాయని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. 4,722 పోస్టుల్లో అత్యధికంగా డీఎంఈ పరిధిలో 3823, తెలంగాణ వైద్యవిధాన పరి షత్ పరిధిలో 757, ఎంఎనే కేన్సర్ ఆస్పత్రిలో 81, ఆయుష్ విభాగంలో 61 పోస్టులు ఉన్నాయి. మొత్తం ప్రక్రియను రెండు నెలల్లోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
వైద్య, ఆరోగ్య శాఖలో రెగ్యులర్ విధానంలో నర్సుల భర్తీకి 2017లో టీఎస్పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చారు. అదే నర్సు పోస్టుల భర్తీకి చివరి నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్లోని లోపాలపై కొంత మంది కోర్టులో కేసులు వేయడంతోపాటు వెయిటేజీ మార్కులపై వైద్య శాఖకు అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. వాటన్నింటినీ పరిష్కరించాక, 2021లో తుది జాబితా విడుదల చేసి, నర్సు లకు పోస్టింగ్లు ఇచ్చారు. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా నర్సు పోస్టుల భర్తీని మెడికల్ బోర్డు ద్వారానే చేపట్టాలని సర్కారు నిర్ణయించింది. నర్సింగ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం 2014 నుంచి ఇప్పటి వరకు 60 వేల మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
Comments
Post a Comment