చంద్రుడిపై అడుగుపెట్టిన మానవుడు మొదటిగా ఏం తిన్నాడో మీకు తెలుసా..? తెలుసుకుందాం రండి..

 రాత్రివేళ చీకటిలో భూమిపై వెలుగునిచ్చే పనిని మన చంద్రుడిదే కదా.. అయితే అంగారక గ్రహ పరిమాణంలో ఉన్న గ్రహశకలం ఒకటి వచ్చి భూమిని ఢీకొనడంతో చంద్రుడు ఏర్పడినట్లు కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సౌర వ్యవస్థలో మానవుడు మొదటిగా అడుగు పెట్టిన ప్రదేశం చంద్రుడు. మరి వ్యోమగాములు చంద్రునిపైకి చేరుకున్నప్పుడు వారు మొదటిసారిగా అక్కడ ఏమి తిన్నారు..? అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? చంద్రుని గురించి మనకు తెలియని కొన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..




ప్రశ్న: మానవుడిని చంద్రునిపైకి తొలిసారిగా తీసుకెళ్లిన అంతరిక్ష నౌక పేరేమిటి? 

సమాధానం: సాటర్న్ V రాకెట్ ద్వారా చంద్రునిపైకి మానవుడు మొదటిసారిగా వెళ్లాడు. ఈ రాకెట్ ద్వారానే నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తొలిసారిగా 1969 జూలై 20న చంద్రునిపై అడుగు పెట్టాడు


ప్రశ్న: చంద్రుని కాంతి భూమిని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? 

జవాబు: కాంతి అంతరిక్షంలో సెకనుకు 1,86,000 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. అలా చంద్రుని కాంతి భూమిని చేరుకోవడానికి దాదాపు 1.3 సెకన్లు పడుతుంది.


ప్రశ్న: భూమి చుట్టూ ఒక భ్రమణం పూర్తి చేయడానికి చంద్రుడు ఎంత సమయం పడుతుంది? 

సమాధానం: చంద్రుడు భూమి చుట్టూ ఒక  భ్రమణం పూర్తి చేయడానికి 27.3 రోజులు పడుతుంది.

ప్రశ్న: భూమి చుట్టూ ఒక భ్రమణం పూర్తి చేయడానికి చంద్రుడు ఎంత సమయం పడుతుంది? 

సమాధానం: చంద్రుడు భూమి చుట్టూ ఒక భ్రమణం పూర్తి చేయడానికి 27.3 రోజులు పడుతుంది.


ప్రశ్న: చంద్రునిపై ఉన్న అతిపెద్ద పర్వతం ఏమిటి? 

సమాధానం: చంద్రునిపై ఉన్న అతిపెద్ద పర్వతం పేరు మోన్స్ హ్యూజెన్స్. దీని ఎత్తు సుమారు 18,000 అడుగులు


ప్రశ్న: చంద్రునిపై మానవులు తిన్న మొదటి ఆహారం ఏమిటి? 

సమాధానం: చంద్రునిపై మానవుడు అడుగుపెట్టినప్పుడు మొదటిసారిగా బేకన్ తిన్నారు. ఇది సాల్టెడ్ పంది మాంసం


Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.