బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..

బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎలా ఎంపిక చేస్తారంటే.. 



 భాస్కరాచార్య నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో-ఇన్ఫర్మేటిక్స్ (బీఐఎస్‌ఈజీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ సంస్థ సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..


భర్తీ చేయనున్న ఖాళీలు..


* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 250 సాఫ్ట్‌వేర్‌ ప్రొఫెషనల్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.


* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్ (కంప్యూటర్/ ఐటీ) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.


ముఖ్యమైన విషయాలు..


* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35000 జీతంగా అందిస్తారు.

* ఎంపికైన అభ్యర్థులు గాంధీనగర్, న్యూఢిల్లీలో పనిచేయాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 03-01-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.


నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..



Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.