తెలంగాణ భూగర్భ జలాల మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షకుపైగా జీతం.


తెలంగాణ రాష్ట్రంలోని భూగర్భ జలాల మంత్రిత్వ శాఖకు చెందిన 25 టెక్నికల్‌ అసిస్టెంట్‌, ల్యాబ్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 




ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్‌ ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ సైన్స్ ఇంజనీరింగ్‌ లేదా సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్‌లో కనీసం 65 శాతం మార్కలతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యునికేషన్‌ ఇంజనీరింగ్‌/కంప్యూటర్ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ పేపర్‌లో గేట్‌ 2021/2022 స్కోర్‌ కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు జులై 1, 2022వ తేదీ నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి


ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్ విధానంలో డిసెంబర్‌ 28, 2022వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్‌ 7వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో అభ్యర్ధులు తప్పనిసరిగా రూ.250లు అప్లికేషన్‌ ఫీజు డిసెంబర్ 21, 2022వ తేదీలోపు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.31,040ల నుంచి రూ.1,27,310ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • టెక్నికల్‌ అసిస్టెంట్‌ (హైడ్రోజియాలజీ) పోస్టులు: 7
  • టెక్నికల్ అసిస్టెంట్‌ (హైడ్రోలజీ) పోస్టులు: 5
  • టెక్నికల్ అసిస్టెంట్‌ (జియోఫిజిక్స్) పోస్టులు: 8
  • ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 1
  • జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు: 4

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.