Telangana: ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..

 తెలంగాణలోని ఉపాధ్యాయులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వారికి సంక్రాతి కానుక ఇవ్వనున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు వెల్లడించారు. 


ఉపాధ్యాయులందరికీ బదిలీలు, పదోన్నతులు కల్పించనున్నట్లు వెల్లడించారు. తాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఈ విషయంపై అడగ్గా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. త్వరలోనే బదిలీలు, షెడ్యూలు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.


శుక్రవారం పీఆర్‌టీయూటీఎస్ నూతన సంవత్సర డైరీనీ ఆవిష్కరించిన మంత్రి హరీశ్ రావు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా వారికి అన్ని రకాలుగా ఉద్యోగ భద్రత కల్పిచటంతో పాటు మెురగైన జీతాలు ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే నిరుద్యోగుల కోసం ఇప్పటికే ఉద్యోగ ప్రకటనలు విడుదల చేశామని చెప్పారు.


సర్కార్ నిర్ణయంతో ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తు్న్న బదిలీలు, పదోన్నతుల కల నెలవేరనుంది. సీనియార్టీ పరంగా ఉపాధ్యాయులు పదోన్నతలు పొందనున్నారు. మరో వైపు ఏళ్లుగా ఒకేచోట పని చేసున్న ఉపాధ్యాయులు తమకు నచ్చిన చోటుకు బదిలీ ఆప్షన్ ఎంపిక చేకుకోనున్నారు.

మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి లోగో పై క్లిక్ చేయండి 


Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.