డిగ్రీ చదివేవారికి రూ.2 లక్షల వరకు స్కాలర్షిప్.. ఇలా అప్లయ్ చేసుకోండి
ప్రతిభ ఉండి ఆర్థిక పరిస్థితుల వల్ల ఉన్నత విద్య చదవలేకపోతున్న విద్యార్థులకు గుడ్న్యూస్.
డిగ్రీ విద్యార్థులకు రిలయన్స్ ఫౌండేషన్ (Reliance Foundation) స్కాలర్షిప్స్ అందిస్తోంది. రిలయన్స్ ఫౌండేషన్ అండర్గ్రాడ్యుయేట్ స్కాలర్షిప్ (Undergraduate Scholarship) ప్రోగ్రామ్ కింద 5,000 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్ ప్రకటించింది. ప్రతిభగల విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా తమ విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు ఈ స్కాలర్షిప్ ఉపయోగపడుతుంది. రిలయన్స్ ఫౌండేషన్ అందిస్తున్న స్కాలర్షిప్స్కు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. 2023 ఫిబ్రవరి 14 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా అప్లయ్ చేసుకోవాలి:
వెబ్సైట్ ఓపెన్ చేయాలి. వివరాలన్నీ చదివిన తర్వాత Click Here to Apply పైన క్లిక్ చేయాలి. పేరు, విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి సబ్మిట్ చేయాలి. యాప్టిట్యూడ్ టెస్ట్, ఫస్ట్ లెవెల్ సెలక్షన్, ఫైనల్ సెలక్షన్ ద్వారా ఈ స్కాలర్షిప్నకు ఎంపికచేస్తారు.
This comment has been removed by a blog administrator.
ReplyDelete