కానిస్టేబుల్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌, పోస్టుల సంఖ్య పెంపు!

 మరోసారి కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను పెంచుతున్నట్టు మార్చి 20న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఈ సారి 3,257 పోస్టులను పెంచడంతో మొత్తం ఖాళీల సంఖ్య 50,187కి చేరింది.


కేంద్ర సాయుధ బలగాలైన బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఎస్‌ఎస్ఎఫ్‌, అస్సాం రైఫిల్స్‌లో కానిస్టేబుల్/రైఫిల్‌మ్యాన్/సిపాయి పోస్టుల కోసం జీడీ పరీక్ష రాసిన అభ్యర్ధులకు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) గుడ్‌న్యూస్‌ చెప్పింది. పోస్టుల సంఖ్యను మరోసారి భారీగా పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా పోస్టుల సంఖ్యను 50,187కి పెంచుతున్నట్టు ఎస్సెస్సీ ప్రకటించింది. నోటిఫికేషన్‌ విడుదల చేసిన సమయంలో పేర్కొన్న పోస్టుల సంఖ్యలో ఇప్పటికే రెండుసార్లు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ సవరణ చేసింది. తొలుత సీఏపీఎఫ్‌ జీడీ కానిస్టేబుల్‌ ఉద్యోగ నియామక నోటిఫికేషన్‌లో 24,369 పోస్టులను కమిషన్‌ ప్రకటించింది. ఆ తర్వాత గతేడాది నవంబర్‌లో ఆ పోస్టుల సంఖ్యను 45,284కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 1,151 ఖాళీలను కలపడంతో మొత్తం పోస్టుల సంఖ్య 46,435కి పెరిగింది. తాజాగా ఐటీబీపీ విభాగంలో మరో 3,257 పోస్టులను కలపడంతో మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య 50,187కు పెరిగింది.

 

* పోస్టుల వివరాలు...

విభాగాల వారీగా ఖాళీలు..


1) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF): 21,052 

2) సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF): 6060 

3) సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్(CRPF): 11,169

4) సశస్త్ర సీమాబల్ (SSB): 2274

5) ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP): 1890 + 3,257 = 5642 

6) అసోం రైఫిల్స్ (AR): 3601

7) సెక్రటేరియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (SSF): 214

8) నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB): 175


 కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు 

                                   

                        


మొదట నోటిఫికేషన్ విడుదల సమయంలో మొత్తం 24,369 ఖాళీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సంఖ్యను గత నవంబర్‌లో 45,284కు పెంచుతూ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరో ప్రకటన విడుదల చేసింది. తాజాగా ఆ పోస్టులకు అదనంగా మరో 1,151 ఖాళీలను కలిపారు. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 46,435కు చేరింది. ‌తాజాగా ఐటీబీపీ విభాగంలో సిబ్బంది నియామకానికి మరో 3,257 పోస్టులను కలపడంతో మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య ‌50,187కు పెరిగినట్టు ఎస్‌ఎస్‌సీ ప్రకటనలో పేర్కొంది. పదోతరగతి విద్యార్హతగా పేర్కొన్న ఈ ఉద్యోగాలకు జనవరిలో రాతపరీక్ష నిర్వహించారు. రాతపరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనున్నారు.


పూర్తి పీడీఎప్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.



Comments

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

టెన్త్‌ తో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.