పదో తరగతి అర్హతతో.. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
భారత హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP).. భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులను భర్తీ చేయనుంది. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ITBP ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 26 దరఖాస్తులకు చివరితేది. వివరాల్లోకెళ్తే..
మొత్తం ఖాళీలు : 458
కానిస్టేబుల్(డ్రైవర్) గ్రూప్ 'సి' నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్): 458 పోస్టులు
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా సంస్థ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయసు 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.21,700-రూ.69,100.
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ), రాత పరీక్ష, ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తులు ప్రారంభం: జూన్ 27, 2023
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 26, 2023
పూర్తి వివరాలకు వెబ్సైట్ :https://recruitment.itbpolice.nic.in/
కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు
Ok
ReplyDeleteOk
DeleteOk
ReplyDelete