పదో తరగతి .. ఆపై ఐటీఐ చదివి .. కేంద్రప్రభుత్వ కొలువులు | ITI +2 NAVY JOBS
ఐటీఐతో నౌకాదళంలోకి
పదో తరగతి .. ఆపై ఐటీఐ చదివి .. కేంద్రప్రభుత్వ కొలువు సాధించాలని భావిస్తున్నారా ?
మీ అభిలాషను నిజం చేసే ప్రకటన వెలువడింది ! వయసులో సడలింపు ఉంటుంది .
ఎంపిక ఇలా : అర్హులైన అభ్యర్థులను రాత పరీక్షకు ఎంపికచేస్తారు . గతంలో నౌకా దళంలో అప్రెంటిస్ గా పనిచేసిన అభ్యర్థులకు రాత పరీక్షలో ప్రాధాన్యమిస్తారు . భారత నౌకాదళంలో 1581 ట్రేడ్స్మన్ ( స్కిల్డ్ ) నియామకాల కోసం ప్రకటన వెలువడింది .
వీటిలో అన్జర్కే 697 , ఎస్సీలకు 215 , ఎస్టీలకు 93 , ఓబీసీలకు 385 , ఈడబ్ల్యూఎస్ కు 141 పోస్టులను కేటా యించారు .
ఈ గ్రూప్ - సి , నాన్ - గెజిటెడ్ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి .
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది .
విద్యార్హత : మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన పరీక్ష పాసైవుండాలి . ఇంగ్లిష్ పరిజ్ఞానం అవసరం . సంబంధిత ట్రేడులో ఐటీఐ అప్రెంటిస్ షిప్ పూర్తిచేసి ఉండాలి . లేదా ఆర్మీ , నేవీ , ఏర్ఫోర్సుల్లో మెకానిక్ లేదా ఇతర విభాగాల్లో రెండేళ్ల పని అనుభవం ఉండాలి . అర్హులకు విద్యార్హతల విషయంలో సడలింపు ఉంటుంది .
వయసు : 18-25 ఏళ్లలోపు ఉండాలి .
ఎస్సీ , ఎస్టీలకు ఐదేళ్లు , ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ + OC 8
రాత పరీక్ష : ఇది మెట్రిక్యులేషన్ స్థాయిలో .. ఇంగ్లిష్ , హిందీ భాషల్లో ఉంటుంది . మొత్తం 100 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు . జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్కు 10 మార్కులు , న్యూమరి కల్ ఎబిలిటీకి 10 మార్కులు , జనరల్ ఇంగ్లి 10 మార్కులు , జనరల్ అవేర్నెస్కు 20 మార్కులు , అప్రెంటిస్ సిలబస్కు 50 మార్కులు కేటాయించారు . రాత పరీక్ష తేదీ , సమయం , వేదిక వివరాలను అభ్యర్థుల ఈమెయిల్ ఐడీకి తెలియజేస్తారు .
వేతనం : లెవెల్ -2 ప్రకారం రూ .19,900 నుండి 63,200 వరకు చెల్లిస్తారు .
ఆన్లైన్ దరఖాస్తుల గడువు : 20.03.2022
Comments
Post a Comment