శాతవాహనుల చరిత్ర , శ్రీముఖుడు నుండి పులోమావి-3 వరకు
శాతవాహనుల చరిత్ర
1) శ్రీముఖుడు
2) కృష్ణ
3) శాతకర్ణి-1
4) వేదశ్రీ
5) శాతకర్ణి-2
6)కుంతల శాతకర్ణి
7) పులోమావి-1
8) హాలుడు
9)గౌతమీ పుత్ర శాతకర్ణి
10)వశిష్ట పుత్ర పులోమావి/ పులోమావి-2
11)వశిష్ట పుత్ర శివ శ్రీ
12)యజ్ఞశ్రీ
14)విజయశ్రీ
15)చంద్రశ్రీ
16)పులోమావి-3
శ్రీముఖుడు
ఇతనికి రాయ అనే బిరుదు కలదు. ఈ బిరుదును మొగల్ చక్రవర్తి అయిన అశోకుడు ఇచ్చాడు. అలాగే రాయసిముఖ శాతవాహన అనే బిరుదు కూడా ఉందని కోటిలింగాలలో దొరికిన నాణెముల ద్వారా తెలుస్తుంది.
ఈయన కాలానికి చెందిన నాణెములు కోటిలింగాల వద్ద దొరికాయి.
ఈయన గోదావరి సమీపంలో కోటిలింగాల వద్ద రాయపట్నం అనే పట్టణాన్ని నిర్మించాడు.
ఈ యొక్క గురువు కాలకచూరి ఈయన జైన మత గురువు.
శ్రీముఖిుడి యొక్క రాజధాని కోటిలింగాలలో కలదు, రెండవ రాజధాని ప్రతిష్టానపురం లో ఉండేది.
ఈయన మహారాష్ట్రలో నాగ జాతికి చెందిన త్రైనకైరో అనే రాజును ఓడించి, అతని కుమార్తె అయిన నాగానికకు శాతకర్ణి-1 కు ఇచ్చి వివాహం జరిపించాడు.
శాతకర్ణి-1 శ్రీముఖి యొక్క కొడుకు. అయితే శ్రీముఖుడు ఫస్టు జైన మతాన్ని తర్వాత వైదిక మతాన్ని స్వీకరించాడు.
కృష్ణ
ఈయన నాసిక్, కన్హరీ గుహలను నిర్మించాడు. అలాగే నాసిక్లో బౌద్ధ సన్యాసుల పరిరక్షణ కొరకు ధర్మ మహామాథ్య అనే పేరుతో వాడిని పరిరక్షించేందుకు కొంతమంది వ్యక్తులను నియమించాడు.
అలాగే దక్షిణ భారతదేశంలో భాగవత మతం ప్రవేశపెట్టాడు, ఈ మతం కర్మ మార్గాన్ని సూచిస్తుంది. ఈ భాగవత మతం అనేది పుష్యమిత్ర కాలంలో ఇండియా లోకి వచ్చింది. అప్పటినుండి వివిధ ప్రాంతాలకు వ్యాప్తి చెందింది.
శాతకర్ణి-1
ఈయన యొక్క బిరుదులు అప్రతిహారచక్ర, ఏకవీర, సుూర, దక్షిణ ప్రజాపతి, సామ్రాట్, అశ్వకాదిీశ అనే బిరుదులు కలవు.
ఈయన యొక్క నాణెములు ఉజ్జయిని పట్టణంలో దొరికాయి, ఈ నాణెములు గజ గుర్తుతో ఉండేవి.
ఈయన నానాఘాట్ శాసనం వేయించాడు, ఈ శాసనం ఆధారంగా నాగానిక ఇతని భార్య అని తెలుస్తుంది.
ఈయన మొట్టమొదట శాతవాహన వంశ నామము ప్రవేశపెట్టాడు, అదేవిధంగా సర్వ స్వతంత్ర పాలనను ప్రారంభించాడు.
వెండి నాణెములను ముద్రించిన మొదటి శాతవాహన రాజు ఈయనే, అలాగే మొదటగా వైదిక యజ్ఞయాగాదులను నిర్వహించి అనేక ప్రత్యేకతలు పొందాడు. రాజశయోగం ఒకసారి, అశ్వమేధ యాగం రెండుసార్లు నిర్వహించాడు.
అలాగే బ్రాహ్మణులకు మొదటగా పన్ను మినహాయింపు తీసివేసి భూములను పంచిపెట్టాడు.
ఈయన ప్రముఖ పాలకులు అయిన ఖారవేలుడు, పుష్యమిత్ర సుంగ, డెమిట్రియస్ లను ఓడించాడు.
ఈయన శ೨౦గులను ఓడించి ఉజ్జయినీ నగరాన్ని ఆక్రమిస్తాడు.
ఖారవేలుడు వేయించిన గుంటుపల్లి శాసనం ప్రకారం ఇతనిని మూషిక అధిపతిగా పేర్కొనటం జరిగింది.
వేదశ్రీ
వేదశ్రీ యొక్క బిరుదు పుర్నోతుంగ. ఖారవేలుడు ఇతని కాలంలో భట్టిప్రోలు పై దాడి చేసి ఈ నగరాన్ని ధ్వంసం చేస్తాడు.
ఇతను నాగానిక మరియు శాతకర్ణి-1 యొక్క కుమారుడు.
ఈయన యొక్క తల్లి నాగానిక ఈయన రాజ్యంలో సంరక్షకురాలు గా ఉండేది. కూడా శాతవాహనుల రాజులలో ప్రముఖ ప్రఖ్యాతలు తెచ్చుకున్న రాజు.
శాతకర్ణి-2
ఈయన సా౦చి స్థూప దక్షిణ తోరణ శాసనం వేయించాడు, అలాగే బిల్సా శాసనం కూడా వేయించాడు.
యుగ పురాణం ప్రకారం పాటలీపుత్ర౦ను కొంతకాలం పరిపాలించాడు. ఉత్తర ఇండియాను పరిపాలించిన మొదటి దక్షిణదేశ రాజు. అలాగే ఇతను విదీష అనే ప్రాంతంలో కూడా ఆక్రమించాడు.
ఇతని యొక్క పరిపాలన కాలం ఇంచుమించుగా 52 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన కూడా శాతవాహనుల రాజులలో పేరుపొందిన రాజు.
కుంతల శాతకర్ణి
ఇతనికి విక్రమార్క, విక్రమాదిత్య అనే బిరుదులు ఉండేవి. ఈయన కాకా౦త్ర వ్యాకరణం అనే సంస్కృత వ్యాకరణ గ్రంథం ను రచించాడు.
ఇతని కాలంలో సంస్కృత భాష రాజభాషగా ప్రకటించబడింది, అలాగే ఈయన రాజ్యంలో సంస్కృత భాష ఎక్కువగా ఉపయోగించేవారు.
ఈయన భార్యలలో ఒకరు అయిన మలయావతి మాయావతి కరిర్త అనే రకామ క్రీడ వలన మరణించింది.
పులోమావి-1
ఈయన వాయు పురాణం ప్రకారం మగధ దేశంలోని రాజు అయిన సుశర్మను ఓడించి పాటలీపుత్రమును ఆక్రమించుకున్నాడు.
సుశర్మ యొక్క వంశం కన్వ వంశం.
పులోమావి-1 పాటలీపుత్రమును ఆక్రమించుకున్న తరువాత ఈ రాజ్యము 10 సంవత్సరాల పాటు నిరాడంబరంగా పరిపాలించాడు.
ఇతనికి సంబంధించిన నాణెములు పాటలీపుత్రం లోని కుహురమ అనే ప్రాంతంలో దొరికాయి.
Comments
Post a Comment