తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నుంచి మరో నోటిఫికేషన్‌.. నెలకు రూ. లక్షకు పైగా జీతం..

 తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఇటీవల వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తూ వస్తోంది. ఞప్పటికే గ్రూప్‌ 1 పరీక్షను నిర్వహించిన టీఎస్‌పీఎస్‌సీ తాజాగా గ్రూప్‌ 2,3,4లకు నోటిఫికేషన్‌లు విడుదల చేసేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీఎస్‌పీఎస్సీ తాజాగా రాష్ట్రంలోని భూగర్భజల విభాగానికి చెందిన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది..




భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 32 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అసిస్టెంట్‌ కెమిస్ట్‌, అసిస్టెంట్‌ జియోఫిజిసిస్ట్‌, హైడ్రాలజిస్ట్‌ పోస్టులున్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టు ఆధారంగా డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ/ ఎంఎస్సీ/ ఎంటెక్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రిక్రూట్‌మెంట్ పరీక్షలో చూపిన మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా రూ. 45,960 నుంచి రూ. 1,33,630 వరకు చెల్లిస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ

 06-12-2022న ప్రారంభమవుతుండగా

 27-12-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.


నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..


పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్