దోస్త్ మూడో రౌండ్ స్పాట్ అడ్మిషన్లు ప్రారంభం.. స్కాలర్షిప్ విద్యార్ధులు అలర్ట్
తెలంగాణ ప్రైవేట్ అన్ ఎయిడెడ్, ప్రైవెట్ ఎయిడెడ్ కాలేజీల్లో నవంబర్ 29 నుంచి డిగ్రీ స్పాట్ అడ్మిషన్లు-రౌడ్ 3 ప్రారంభంకానున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి ప్రకటించారు..
ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదల చేశారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు దోస్త్ అధికారిక వెబ్సైల్లో కాలేజీల లిస్టును చెక్ చేసుకోవచ్చు. ఈ కాలేజీలు/ఇన్స్టిట్యూట్లలో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు ప్రభుత్వ స్కాలర్షిప్/ఫీజు రీఎంబర్స్మెంట్లకు అనర్హులు. అప్షన్లు ఇచ్చుకున్న విద్యార్ధులకు సీట్ల కేటాయింపు వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫోన్ నంబర్కు ఎస్ఎమ్ఎస్ లేదా వాట్సప్కు పంపించడం జరుగుతుందని ఉన్నత విద్యామండలి వివరించింది.
Comments
Post a Comment