TS EAMCET 2023 : మార్చి 3 నుంచి ఎంసెట్ దరఖాస్తులు ప్రారంభం.. నోటిఫికేషన్ విడుదల
.jpeg)
తెలంగాణ ఎంసెట్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 3 నుంచి ప్రారంభం కానుంది. ఎంసెట్ నోటిఫికేషన్ను ఫిబ్రవరి 28న విడుదల చేయనున్నారు. మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా ఎంసెట్ మార్కులతోనే ర్యాంకు గత మూడేళ్లుగా ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇవ్వడం లేదని, ఈసారి కూడా ఉండదని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. ‘‘ఎంసెట్ మార్కులతోనే ర్యాంకు కేటాయిస్తాం. అందుకు ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. జేఈఈ మెయిన్, నీట్, ఇతర ఏ ప్రవేశ పరీక్షల్లోనూ ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇవ్వడం లేదు. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాన్ని నిపుణుల కమిటీతో పరిశీలించి తెలంగాణ ఎంసెట్లో వెయిటేజీని తొలగించాం. ప్రస్తుతానికి ఈ ఒక్క ఏడాది విషయంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. కరోనా కారణంగా 2020 నుంచి ఇంటర్లో పర్సంటేజీతో సంబంధం లేకుండా ఇంజినీరింగ్, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు అనుమతించాం. ఈసారి ఇంటర్మీడియట్లో ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం, ఇతరులకు 45 శాతం మార్కులు తప్పనిసరి. ఇంటర్ ఫస్టియర్లో 70 శాతం సిలబస్ ఆధారంగానే ఎంసెట్లో ప్రశ్నలు ఇస్తాం. రెండో ఏడాదిలో మాత్రం 100 శాతం సిలబస్ ఉంటుంది...