ఇండియన్ నేవీలో 372 ఛార్జ్మ్యాన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
భారత త్రివిధ దళాలకు చెందిన ఇండియన్ నేవీలో 372 ఛార్జ్మ్యాన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇండియన్ నావల్ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఛార్జ్ మ్యాన్ పోస్టుల భర్తీకి భారత నౌకాదళం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ప్రకటన ద్వారా 372 పోస్టులు దేశవ్యాప్తంగా భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు: ఛార్జ్మ్యాన్ - 372 పోస్టులు
గ్రూప్: ఎలక్ట్రికల్, వెపన్, ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్, ప్రొడక్షన్ ప్లానింగ్ అండ్ కంట్రోల్
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: మే 29, 2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: రూ. 35,400 నుంచి రూ. 1,12,400.
అప్లికేషన్ ఫీజు: రూ. 278 చెల్లించాలి. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు)
ఎంపిక: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఏపీ, టీఎస్లో పరీక్షా కేంద్రాలు: విశాఖపట్నం, హైదరాబాద్.
చివరి తేదీ: మే 29, 2023
ఎంపికైన అభ్యర్థులు హెడ్క్వార్టర్స్ వెస్ట్రన్ నేవల్ కమాండ్ (ముంబయి), హెడ్క్వార్టర్స్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ (విశాఖపట్నం), హెడ్క్వార్టర్స్ సదరన్ నేవల్ కమాండ్ (కొచ్చి), హెడ్క్వార్టర్స్ అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ (పోర్ట్ బ్లెయిర్) యూనిట్లలో పని చేయాల్సి ఉంటుంది...
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment