తెలంగాణ కేజీబీవీల్లో 1241 ఉద్యోగాలు..ఎంపిక విధానం ఇలా...
తెలంగాణలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ (యూఆర్ఎఎస్)లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీనిద్వారా మొత్తం 1,241 పోస్టులను భర్తీ చేయనున్నారు.
విటిలో స్పెషల్ ఆఫీసర్, పీజీసీఆర్టీ, సీఆర్టీ, పీఈటీలు పోస్టులు ఉన్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు జూన్ 26 నుంచి జులై 5 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు...
➥ కేజీబీల్లో ఖాళీలు
పోస్టుల సంఖ్య: 1218
1) స్పెషల్ ఆఫీసర్ (ఎస్వో): 38 పోస్టులు
2) పీజీ కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ (పీజీసీఆర్టీ): 849 పోస్టులు
సబ్జెక్టులవారీగా ఖాళీలు: ఇంగ్లిష్-110, మ్యాథమెటిక్స్-60, నర్సింగ్-110, తెలుగు-104, ఉర్దూ-02, బోటనీ-55, కెమిస్ట్రీ-69, సివిక్స్-55, కామర్స్-70, ఎకనామిక్స్-54, ఫిజిక్స్-56, జువాలజీ-54.
3) కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ (సీఆర్టీ): 254
సబ్జెక్టులవారీగా ఖాళీలు: బయోసైన్స్-25, ఇంగ్లిష్-52, హిందీ-37, మ్యాథమెటిక్స్-45, ఫిజికల్ సైన్స్-42, సోషల్ స్టడీస్-26, తెలుగు-27.
4) ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (పీఈటీ): 77
➥ అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఖాళీలు..
పోస్టుల సంఖ్య: 23
1) స్పెషల్ ఆఫీసర్: 04
2) కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచర్ (సీఆర్టీ): 19
సబ్జెక్టులవారీగా ఖాళీలు: తెలుగు-05, ఇంగ్లిష్-05, సైన్స్-06, సోషల్ స్టడీస్-03.
అర్హతలు:
➦ పీజీసీఆర్టీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులతో పీజీ డిగ్రీ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. .
➦ పీజీసీఆర్టీ నర్సింగ్ పోస్టులకు 50 శాతం మార్కులతో ఎంఎస్సీ (నర్సింగ్)/బీఎస్సీ (నర్సింగ్) ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
➦ స్పెషల్ ఆఫీసర్ పోస్టులకు 50 శాతం మార్కులతో పీజీ డిగ్రీ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
➦ పీఈటీ పోస్టులకు 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ఆన్లైన్ రాతపరీక్ష ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.600.
ముఖ్యమైన తేదీలు..
➥ నోటిఫికేషన్ వెల్లడి: 16.06.2023
➥ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.06.2023.
➥ ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 05.07.2023.
➥ హాల్టికెట్ డౌన్లోడ్: పరీక్షకు వారం ముందు నుంచి.
➥ రాతపరీక్ష తేది: జులై నెలలో.
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి | CLICK HERE |
Sanjay Kumar
ReplyDelete