ఇండియన్ ఆర్మీ స్పెషల్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..
భారత రక్షణ దళాల్లో సేవలు అందించాలనుకునే వారికి ఒక గుడ్న్యూస్. ఆర్మీలో వివిధ ఉద్యోగాల కోసం మరో నోటిఫికేషన్ వచ్చింది.
ఇండియన్ ఆర్మీ తాజాగా షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్(SSC Tech)- 2023 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వివాహం కాని పురుష, మహిళా గ్రాడ్యుయేట్స్ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిఫెన్స్ పర్సనల్ వితంతువులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారిక పోర్టల్ joinindianarmy.nic.in ద్వారా జులై 19లోపు అర్హత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. ఎంపికయ్యే అభ్యర్థులకు 2024 ఏప్రిల్లో చెన్నైలో ఉన్న ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ(OTA)లో ట్రైనింగ్ కోర్సు ప్రారంభమవుతుంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 194 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఖాళీల వివరాలు
SSC (టెక్) పురుషులు- 175
SSC (టెక్) మహిళలు- 19
SSCW టెక్ & నాన్ టెక్- 2
అర్హత ప్రమాణాలు
అభ్యర్థుల వయసు 2024 ఏప్రిల్ 1 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిఫెన్స్ పర్సనల్ వితంతువుల గరిష్ట వయసు 35 ఏళ్లలోపు ఉండాలి. ఇంజనీరింగ్ పూర్తి చేసిన, చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్ ప్రాసెస్
- ముందు అధికారిక పోర్టల్ joinindianarmy.nic.in విజిట్ చేసి, హోమ్పేజీలో అందుబాటులో ఉన్న ఆఫీసర్ ఎంట్రీ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అవసరమైన అన్ని వివరాలు ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి.
- తర్వాత రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్వర్డ్ సాయంతో లాగిన్ అయి అప్లికేషన్ నింపాలి. అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. చివరగా అప్లికేషన్ను సబ్మిట్ చేయాలి.
ఎంపిక ప్రక్రియ
అభ్యర్థుల ఎంపిక వివిధ దశల్లో జరుగుతుంది. ముందుగా వచ్చిన అప్లికేషన్స్ను షార్ట్లిస్ట్ చేస్తారు. తర్వాత ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. ఇందులో క్వాలిఫై అయిన వారికి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఎంపికయ్యే అభ్యర్థులకు చెన్నై ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో 49 వారాల ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ పూర్తిచేసే అభ్యర్థులకు మద్రాస్ యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ డిఫెన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ సర్టిఫికేట్ ప్రదానం చేస్తారు.
జడ్జ్ అడ్వకేట్ జనరల్(JAC) కోర్సు , ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కోసం కూడా ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ చేపడుతోంది. JAG కోర్సు కోసం దరఖాస్తు ప్రకియను జులై 21లోపు ముగుస్తుంది. NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు కోసం ఆగస్టు 3 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఏసీ కోర్సు కోసం ఇండియన్ ఆర్మీలో చేరాలంటే అభ్యర్థులు ఎల్ఎల్బీలో కనీసం 55 శాతం గ్రేట్ పాయింట్స్ సాధించి ఉండాలి.
బార్ కౌన్సిల్లో అడ్వకేట్గా రిజిస్టర్ అయి ఉండాలి. అభ్యర్థుల వయసు 21 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు కోసం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీని కనీసం 50 శాతం గ్రేడ్ పాయింట్స్తో పూర్తి చేసి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 19 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment