RAILWAY JOB: దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

 దక్షిణ మధ్య రైల్వే నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్  విడుదలైంది.


సికింద్రాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను  భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. టెక్నికల్ అసోసియేట్ పోస్టులను ఈ నోటిఫికేషన్  ద్వారా భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 35 కాగా.. కాంట్రాక్ట్ విధానంలో వీటిని భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 30వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులు చేరేలా సమర్పించాల్సి ఉంటుంది.


ఖాళీల వివరాలు:

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 35 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. సివిల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ విభాగంలో ఖాళీలు ఉన్నాయి.


విద్యార్హత: డిప్లొమా, బీఎస్సీ, ఇంజనీరింగ్ లో డిగ్రీ (ఐటీ/సీఎస్/కంప్యూటర్ ఇంజనీరింగ్/సివిల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్) లో పాసైన వారితో పాటు అనుభవం ఉండాలి. పూర్తి వివరాలు నోటిఫికేషన్లో చూడొచ్చు. అభ్యర్థుల వయస్సు 18-33 ఏళ్లు ఉండాలి.


అభ్యర్థుల ఎంపిక: విద్యార్హత, అనుభవం, పర్సనాలిటీ/ఇంటెలిజెన్స్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.


దరఖాస్తులను పంపించాల్సిన చిరునామా: అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 30వ తేదీలోగా సెక్రటరీ టు ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ అండ్ సీనియర్ పర్సనల్ ఆఫీసర్ (ఇంజినీరింగ్), ఆఫీస్ ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్, 4వ అంతస్తు, పర్సనల్ డిపార్ట్మెంట్, రైల్ నిలయం, SCR, సికింద్రాబాద్ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.



  దరఖాస్తు ఫామ్ కోసం PDF లింక్ ఓపెన్ చేయండి
నోటిఫికేషన్ PDfCLICK HERE
అధికారిక వెబ్‌సైట్CLICK HERE
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి  CLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE



Comments

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్