ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అనుమతి... ఖాళీల వివరాలివే
తెలంగాణలో టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త.
తెలంగాణలోని ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి
1. తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ (DSC) ద్వారా మొత్తం 5,089 పోస్టుల్ని భర్తీ చేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేసింది.
2. ఖాళీల వివరాలు చూస్తే 2,575 ఎస్జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్, 611 లాంగ్వేజ్ పండిట్స్, 164 పీఈటీ పోస్టులు ఉన్నాయి. మొత్తం 5,089 ఖాళీలను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ శుక్రవారం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది
3. ఈ పోస్టుల్ని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తారని భావించారు. కానీ గతంలో నియమించినట్టుగా డీఎస్సీ ద్వారానే పోస్టుల్ని భర్తీ చేస్తామని ఇప్పటికే విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి వెల్లడించారు.
4. ఇప్పటికే టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ దరఖాస్తు ప్రక్రియ పూర్తైంది. సెప్టెంబర్ 15న టెట్ జరగనుంది. సెప్టెంబర్ 27న ఫలితాలు వస్తాయి. టెట్లో క్వాలిఫై అయినవారంతా టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ రాయొచ్చు. ఎంపికైన వారి జాబితా డీఎస్సీకి పంపిస్తారు. జిల్లాల వారీగా నియామకాలు ఉంటాయి.
నియామకాలకు సంబంధించి జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్లు చైర్మన్ గా ఉంటారని.. అడిషనల్ కలెక్టర్ వైస్ చైర్మన్ డీఈఓ సెక్రటరీగా వ్యవహరిస్తారని తెలిపారు. రెండ్రోజుల్లోనే నోటిఫికేషన్, విధివిధానాలను విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు
6. జిల్లా కలెక్టర్లు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తారని ప్రకటించారు. ఇందులో స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి 5,089 టీచర్ పోస్టులు, ప్రత్యేక విద్యార్థుల పాఠశాలల్లో 1523 స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు వివరించారు..
కింది పిక్స్ పై క్లిక్ చేయడం ద్వారా మా గ్రూప్స్ లో జాయిన్ అవ్వచ్చు
Comments
Post a Comment