స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో 2 వేల పీఓ ఉద్యోగాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 వేల పీఓ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను ఈ రోజు నుంచి ప్రారంభించింది ఎస్బీఐ.
విద్యార్హతల వివరాలు:
ఎస్బీఐలో పీఓ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా స్ట్రీమ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే వారి కనీస వయస్సు 21 సంవత్సరాలు ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. గరిష్టంగా 30 ఏళ్లు ఉండాలి. అయితే, రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న వారికి గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
ఖాళీల వివరాలు..
మొత్తం ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు 2000 ఉండగా.. కేటగిరీల వారీగా చూస్తే..
ఎస్సీ- 300,
ఎస్టీ- 150,
ఓబీసీ- 540,
ఈడబ్ల్యూఎస్- 200,
యూఆర్- 810..
దరఖాస్తు ఫీజు:
జనరల్ / EWS మరియు OBCలకు రూ.750 దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. SC / ST మరియు దివ్యాంగులకు దరఖాస్తు ఉచితం అని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ విడుదల- సెప్టెంబర్ 6
దరఖాస్తు తేదీలు- సెప్టెంబర్ 7 నుంచి 27
ప్రిలిమ్స్ పరీక్ష-నవంబర్ 2023
ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డ్స్ విడుదల-అక్టోబర్ రెండవ వారం
ప్రిలిమ్స్ ఫలితాలు నవంబర్ లేదా డిసెంబర్ నెలలో..
జీతం..
అభ్యర్థుల ఎంపిక: ఎస్బీఐ పీఓ ఉద్యోగాలకు మొత్తం 3 దశల్లో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. మొదట ప్రిలిమ్స్ ఉంటుంది. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారికి మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ లో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ మరియు గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. అన్ని రౌండ్లను క్లియర్ చేసిన వారు ప్రొబేషనరీ ఆఫీసర్ లేదా మేనేజ్మెంట్ ట్రైనీ గా నియమితులవుతారు.
ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
అధికారిక వెబ్సైట్ | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment