భారత్‌ పెట్రోలియంలో పోస్టులు.. నెలకు రూ. 25 వేలు జీతం

 ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) కొత్తగా పలు అప్రెంటిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.



అప్రెంటిస్(సవరణ) చట్టం, 1973 ప్రకారం, అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు


నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 125 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. వీటిలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ప్రభుత్వంచే గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ డిగ్రీని పూర్తి చేసి ఉండాలి. డిగ్రీలో చేసిన  చేసిన స్పెషలైజేషన్‌ ఆధారంగా అప్రెంటిస్‌ పోస్టుకు ఎంపిక చేస్తారు.


ఇక గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 27 ఏళ్లు మించకూడదు. అయితే నిబంధనల ఆధారంగా వయసు విషయంలో వయో సడలింపు వర్తిస్తుంది. ఇందుకోసం పూర్తి నోటిఫికేషన్ చూడాల్సి ఉంటుందని అధికారులు అభ్యర్థులకు సూచించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.


గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 25,000 వరకు స్టైఫండ్‌ అందిస్తారు. ఎంపికైన అభ్యర్థులు ఒక ఏడాది పాటు అప్రెంటిస్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ ధరఖాస్తుల స్వీకరణకు 15-09-2023ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌ సైట్‌ క్లిక్‌ చేయండి.






Comments

Post a Comment

Popular posts from this blog

డిగ్రీతో యూనియన్‌ బ్యాంక్‌లో భారీ ఉద్యోగాలు..

డిగ్రీ అర్హత తో సీబీఐలో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

రైల్వే' కొలువుల భర్తీకి నోటిఫికేషన్