పంచాయతీరాజ్ లో 740 జాబ్స్.. పోస్టుల వివరాలివే
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకణలో భాగంగా 740 పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నారు.
దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్(Engineering) విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. కొత్త పోస్టులను సృష్టించింది. రోడ్లకు పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చే అధికారాన్ని అధికారులకు కట్టబెట్టింది. క్షేత్రస్థాయిలో వాస్తవ పనులకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది ఉండేలా సర్కారు చర్యలు చేపట్టింది.
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించడం వల్ల కొత్తగా 740 పోస్టులు క్రియేట్ కానున్నాయి. జిల్లాల్లో పనుల పర్యవేక్షణకు నాలుగు చీఫ్ ఇంజినీర్ పోస్టులను మంజూరు చేశారు
12 సూపరింటెండెంట్ ఇంజినీర్, 11 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, 60 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయాలు, పోస్టులను మంజూరు చేశారు. వీటితో అనేక మంది అధికారులకు పదోన్నతులు రానున్నాయి. ఇంజినీర్లు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న కల నెరవేరింది.
ఇప్పటికు పదోన్నతులు కల్పించగా.. కొత్తగా 740 పోస్టులను సైతం భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి స్కేల్ ఆఫ్ పే రూ. 24, 280 - 1, 62, 070/- వరకు ప్రతినెల అన్ని అలవెన్స్ లతో కలిపి జీతంగా చెల్లించడం ఉంటుంది.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలివే:
- చీఫ్ ఇంజనీర్ - 04
- సూపరిటెండింగ్ ఇంజనీర్ - 13
- ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ - 34
- డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ - 123
- AEEs/ AEs/ MEO - 314
- టెక్నికల్ ఆఫీసర్ - 23
- అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ - 28
- జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ - 72
- డివిజనల్ అకౌంటెంట్స్ ఆఫీసర్ - 07
- నాన్-టెక్నికల్ పర్సనల్ అసిస్టెంట్ - 02
- సూపరీటెండెంట్ - 30
- సీనియర్ అసిస్టెంట్ - 30
- జూనియర్ అసిస్టెంట్ - 60
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి | CLICK HERE |
Comments
Post a Comment