సింగరేణిలో పోస్టులకు నోటిఫికేషన్లు
సింగరేణి కాలరీస్ లో ఖాళీగా ఉన్న డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను, ఇంటర్నల్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు సిద్దం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి సింగరేణి సీఎండీ బలరామ్ నాయక్ ను ఆదేశించారు..
సింగరేణి కాలరీస్ లో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను, 168 ఇంటర్నల్ రిక్రూట్మెంట్ పోస్టులను తక్షణమే భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్లు సిద్దం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. సింగరేణి ఛైర్మన్ అండ్ ఎండీ బలరామ్ నాయక్ ను ఆదేశించారు. ఈ ఏడాదిలో కనీసం 1000 మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.
సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఆభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై బుధవారం సచివాలయంలో సింగర్రేణి సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరామ్, డైరెక్టర్(పర్సనల్) ఎన్.వి.కె.శ్రీనివాస్, ఇతర అధికారులతో భట్టి విక్రమార్క ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటి సీఎం భట్టి మాట్లాడుతూ.. ఉద్యోగాల నియామక ప్రక్రియ చాలా పారదర్శకంగా ఉండాలన్నారు. పరీక్షల్లో ఏలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. నోటిఫికేషన్ల ప్రక్రియ పకడ్భందీగా ఉండాలని సూచించారు.
నోటిఫికేషన్లు జారీ చేస్తామన్న సింగరేణి సీఎండీ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశాల మేరకు సింగరేణిలో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్, 168 ఇంటర్నల్ పోస్టులకు గురువారం నోటిఫికేషన్ల ను జారీ చేస్తున్నామని ఆసంస్థ ఛైర్మన్ అండ్ ఎండీ ఎన్.బలరామ్ వెల్లడించారు. డిప్యూటీ సీఎంతో భేటీ అనంతరం హైదరాబాద్ సింగరేణి భవన్ లో డైరెక్టర్లతో సమావేశం నిర్వహించారు. వారసుల వయో పరిమితిని 40 ఏళ్లకు పెంచే ప్రతిపాదనలపై అన్ని చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ (పర్సనల్) ఎన్.వి.కె.శ్రీనివాస్ ను ఆదేశించారు. కొత్తగూడెం సోలార్ ప్లాంట్ ప్రారంభం పనులను, అలాగే హైదరాబాద్ అతిథి గృహం భూమి పూజ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
పైన పోస్ట్ కి సంబందించి ముఖ్యమైన లింకులు
మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్లో చేరండి | CLICK HERE |
IDBI ASSISTENT MANAGER POSTS 👇👇👇👇
Comments
Post a Comment