ఎస్బీఐలో 12వేల ఖాళీలు..
మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందునా బ్యాంకు ఉద్యోగాలంటే.. యువతకు మరింత క్రేజ్. ఎలాంటి ఒత్తిడి లేకుండా.. అధిక వేతనం, సెలవులు పొందే అవకాశం ఉందడటంతో.. చాలా మంది యువత బ్యాంకు ఉద్యోగాల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటారు.
దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ.. నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త చెప్పింది. దాదాపు 12 వేల మంది ఉద్యోగులను నియమించుకునేందుకు రెడీ అయ్యింది. ఆయా విభాగాల్లో పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించి.. ఈ నోటిఫికేషన్ను వెల్లడించింది. 12 వేల ఉద్యోగాల్లో.. ప్రధానంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఇతర విధుల్లో ఉద్యోగులుగా నియమించేందుకు సిద్దంగా ఉన్నామని చైర్మన్ దినేష్ ఖరా వెల్లడించారు.
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐలో ప్రస్తుతం 2,32,296 మంది ఉద్యోగులున్నారనీ చెప్పుకొచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 2,35,858గా ఉండేదని తెలిపారు. ఈ క్రమంలో సుమారు 11,000 నుండి 12,000 మంది ఉద్యోగులు రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమైందని చైర్మన్ తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రకటన వెలువడనుంది అని వెల్లడించారు. వీరు సాధారణ ఉద్యోగులు, కానీ వాస్తవానికి వారు అసోసియేట్ స్థాయిలో, అధికారుల స్థాయిలో, వారిలో 85 శాతం మంది రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఉందని ఖరా తెలిపారు.
Comments
Post a Comment