Posts

Showing posts from November, 2022

Topic: తెలంగాణ – పర్యాటక రంగం

Image
Telangana Geography- 10 Questions       Topic: తెలంగాణ – పర్యాటక రంగం   Introduction:- భారతదేశంలాగానే తెలంగాణ రాష్ట్రం కూడా అతిపురాతన ప్రాచీన చారిత్రక సంపద, సంస్కృతీ, సంప్రదాయాలు కొనసాగుతూ వస్తున్న ఒక ప్రాంత అభివృద్ధికి సాంస్కృతిక అంశాలే కాకుండా భౌగోళిక పరిస్థితులు కూడా దోహదపడుతాయి. ముఖ్యంగా శీతోష్ణస్థితి, ఎత్తైన ప్రదేశాలు, అడవులు, నదులు మొదలైనవి కూడా ఎంతో ప్రాధాన్యతను. సంతరించుకుంటాయి. పర్యాటక రంగ అభివృద్ధికి మెరుగైన రవాణా సౌకర్యాలు మరియు వాణిజ్య సము రాయాలు ఇతోధికంగా తోడ్పడుతాయి. 2014లో ఏర్పడిన నూతన రాష్ట్ర ప్రభుత్వం. విస్మరించిన చారిత్రక ప్రాంతాలను, మరుగునపడిన చారిత్రక వారసత్వ సంపదను పరిరక్షించుటకు అందుకనుగుణంగానే కృషి చేస్తుంది. తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ను 28 ఆగష్టు 2014న ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్ గా నియమించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షించడానికి నూతన విధాన నిర్ణయాలతో ముందుకు సాగుతుంది. పర్యాటక స్థలాలను క్రింది విధoగా విభజిoచవచ్చును. 1.చారిత్రక స్థలాలు కట్టడాలు, సాంస్కృతిక కేంద్రాలు (Heritage మం...

దోస్త్‌ మూడో రౌండ్‌ స్పాట్‌ అడ్మిషన్లు ప్రారంభం.. స్కాలర్‌షిప్‌ విద్యార్ధులు అలర్ట్

Image
  తెలంగాణ ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌, ప్రైవెట్ ఎయిడెడ్ కాలేజీల్లో నవంబర్‌ 29 నుంచి డిగ్రీ స్పాట్ అడ్మిషన్లు-రౌడ్‌ 3 ప్రారంభంకానున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆర్ లింబాద్రి ప్రకటించారు.. ఈ మేరకు షెడ్యూల్‌ కూడా విడుదల చేశారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు  దోస్త్ అధికారిక వెబ్‌సైల్‌ లో కాలేజీల లిస్టును చెక్‌ చేసుకోవచ్చు. ఈ కాలేజీలు/ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు ప్రభుత్వ స్కాలర్‌షిప్‌/ఫీజు రీఎంబర్స్‌మెంట్‌లకు అనర్హులు. అప్షన్లు ఇచ్చుకున్న విద్యార్ధులకు సీట్ల కేటాయింపు వివరాలను రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ఫోన్‌ నంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్‌ లేదా వాట్సప్‌కు పంపించడం జరుగుతుందని ఉన్నత విద్యామండలి వివరించింది.

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నుంచి మరో నోటిఫికేషన్‌.. నెలకు రూ. లక్షకు పైగా జీతం..

Image
 తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఇటీవల వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తూ వస్తోంది. ఞప్పటికే గ్రూప్‌ 1 పరీక్షను నిర్వహించిన టీఎస్‌పీఎస్‌సీ తాజాగా గ్రూప్‌ 2,3,4లకు నోటిఫికేషన్‌లు విడుదల చేసేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీఎస్‌పీఎస్సీ తాజాగా రాష్ట్రంలోని భూగర్భజల విభాగానికి చెందిన పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది.. భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు.. * నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 32 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * వీటిలో అసిస్టెంట్‌ కెమిస్ట్‌, అసిస్టెంట్‌ జియోఫిజిసిస్ట్‌, హైడ్రాలజిస్ట్‌ పోస్టులున్నాయి. * పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టు ఆధారంగా డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ/ ఎంఎస్సీ/ ఎంటెక్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. * అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ముఖ్యమైన విషయాలు.. * ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులను రిక్రూట్‌మెంట్ పరీక్షలో చూపిన మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. * ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా రూ. 45,960 నుంచి రూ. 1,33,630 వరకు చె...

KVS Recruitment 6,414 ప్రైమరీ టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ..

Image
  కేంద్రీయ విద్యాలయ సంగతన్ (KVS) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 6414 TGTలు, PGTలు, సెక్షన్ ఆఫీసర్లు, ప్రిన్సిపాల్స్ మరియు ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కేంద్రీయ విద్యాలయ సంగతన్ (KVS) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు..   TGT, PGT, సెక్షన్ ఆఫీసర్లు, ప్రిన్సిపాల్స్ మరియు ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇవి మొత్తం 6990  ఖాళీలు ఉన్నాయి.  అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు KVS అధికారిక వెబ్‌సైట్  kvsangathan.nic.in లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రైమరీ టీచర్ పోస్టులు 6414 ఉన్నాయి. వీటికి దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 05, 2022 నుంచి ప్రారంభం అయి.. డిసెంబర్ 26 వరకు కొనసాగుతుంది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను www.kvsangathan.nic.in. సందర్శించొచ్చు. కేటగిరీల వారీగా పోస్టులు జనరల్ - 2599 ఓబీసీ -1731 ఎస్సీ - 962 ఎస్టీ - 481 ఈబ్ల్యూఎస్ - 641 ఓహెచ్ - 97 వీహెచ్ - 9...

టీచర్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్లు.. 13,404 ఖాళీలు

Image
  కేంద్రీయ విద్యాలయ సంగతన్ (KVS) నుంచి రెండు భారీ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. వీటిలో 6414 ఖాళీలతో ప్రైమరీ టీచర్ పోస్టులకు ఒక నోటిఫికేషన్ విడుదల కాగా.. 6,990 TGT, PGT, సెక్షన్ ఆఫీసర్లు, ప్రిన్సిపాల్స్ మరియు ఇతర పోస్టులకు మరో నోటిఫికేషన్ విడుదలైంది. ఇలా మొత్తం రెండు నోటిఫికేషన్ల నుంచి  13, 404 పోస్టులను భర్తీ చేయనున్నారు.  అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు KVS అధికారిక వెబ్‌సైట్   kvsangathan.nic.in   ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ప్రైమరీ పోస్టుల వివరాలు ఇలా.. ప్రైమరీ టీచర్ పోస్టులు 6414 ఉన్నాయి. వీటికి దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 05, 2022 నుంచి ప్రారంభం అయి.. డిసెంబర్ 26 వరకు కొనసాగుతుంది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను  www.kvsangathan.nic.in . సందర్శించొచ్చు. 50 శాతం మార్కులతో 10+2 ఇంటర్మీడియట్ & CTET పరీక్ష ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల యొక్క వయస్సు  18 నుంచి  30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది.  B.Ed చేసిన అభ్యర...

స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌ సీజీఎల్‌, సీహెచ్‌ఎస్‌ఎల్, జీడీ పరీక్షల 2023 షెడ్యూల్‌ ఇదే..

Image
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ త్వరలో భర్త చేయనున్న సీజీఎల్‌, సీహెచ్‌ఎస్‌ఎల్, జీడీ, సీఏపీఎఫ్‌ఎస్‌.. తదితర ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ప్రతీ యేట ఎస్సీస్సీ నియామక ప్రక్రియ చేపడుతోన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన పలు నోటిఫికేషన్లకు నిర్వహించనున్న పరీక్ష తేదీలను ప్రకటిస్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాలు  అధికారిక వెబ్‌సైట్  లో చెక్ చేసుకోవచ్చు. షెడ్యూల్‌ ప్రకారం పరీక్షల తేదీలివే.. ఎస్‌ఎస్‌సీ తాజాగా కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ (సీజీఎల్‌)- 2021 (స్కిల్ టెస్ట్) తేదీ: జనవరి 6, 2023. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్ (సీహెచ్‌ఎస్‌ఎల్‌)- 2021 (స్కిల్ టెస్ట్) తేదీ: జనవరి 4, 5 తేదీల్లో, 2023. సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎస్ఎస్), ఎన్‌ఐఏ, ఎస్‌ఎస్‌ఎఫ్‌, రైఫిల్‌మ్యాన్ (జీడీ) ఇన్ అస్సాం రైఫిల్స్ ఎగ్జామినేషన్ 2022 పరీక్ష తేదీ: జనవరి 10 నుంచి ఫిబ్రవరి 14 వరకు, 2023. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ ‘సీ’ అండ్‌ ‘డీ’ ఎగ్జామినేషన్- 2022 (స్కిల్ టెస్ట్) తేదీ: ఫిబ్రవరి 15, 16 తేదీల్లో, 202...

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2, 3, 4 వరుస నోటిఫికేషన్లు డిసెంబర్‌లో వస్తున్నాయ్‌.. మొదట ఏదంటే..

Image
తెలంగాణలో గ్రూప్‌-2, 3, 4 పోస్టుల భర్తీ కోసం డిసెంబరులో వరుసగా నోటిఫికేషన్లను జారీ చేయాలని టీఎస్‌పీఎస్సీ భావిస్తోంది. ఉద్యోగ ప్రకటనలపై నియామక సంస్థలు కసరత్తు వేగవంతం చేశాయి. ప్రభుత్వ అనుమతులు వచ్చిన పోస్టులకు వీలైనంత త్వరగా ప్రకటనలు జారీ చేయాలని భావిస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం అనుమతించిన 9,168 గ్రూప్‌-4 పోస్టులు, 783 గ్రూప్‌-2 పోస్టులు, 1373 గ్రూప్-3 పోస్టులతోపాటు అత్యధిక పోస్టులున్న గురుకుల ఉద్యోగ ప్రకటనలు త్వరగా వెలువరించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. నియామక సంస్థలు సంబంధిత విభాగాధిపతులతో సమావేశాలు నిర్వహిస్తూ ఉద్యోగ ప్రకటనల జారీకి వీలుగా ప్రతిపాదనల్ని పరిశీలిస్తున్నాయి. ఇవే కాకుండా సుమారు 1,000 ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి కూడా ప్రకటనను జారీ చేయాల్సి ఉంది.. ఈ నోటిఫికేషన్లన్నింటినీ డిసెంబర్‌ 31లోగా జారీ చేయాలని టీఎస్పీయస్సీ యోచిస్తోంది. దరఖాస్తు స్వీకరణకు నెల రోజుల గడువు, ప్రిపరేషన్‌కు 3 నెలల సమయం ఉండేలా షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెలల్లో గ్రూప్‌ పరీక్షలన నిర్వహణ చేపట్టకూడదని భావిస్త...

కెమిస్ట్రీ ప్రాక్టీస్ బిట్స్ ,తెలుగు & ENGLISH

Image
1. కిందివాటిలో సరికానిది ఏది? 1) ద్రవ బంగారం అని పెట్రోలియంకు పేరు 2) కోల్‌ నుంచి కోక్‌ను తయారు చేసే ప్రక్రియలో లభించే వాయువు కోల్‌ వాయువు 3) తరిగిపోని శక్తి వనరు పెట్రోలియం ఎ) 3 ✔️ బి) 1  సి) 2  డి) 1, 2 2. 200 పదార్థాల మిశ్రమంగా దేనిని పిలుస్తారు? ఎ) కోల్‌  బి) కోల్‌ వాయువు సి) కార్బన్‌  డి) కోల్‌ తార్✔️‌ 3. సీఎన్‌జీని విస్తరించండి? ఎ) Codensed Natural gas బి) Compressed Natural gas✔️ సి) Complet Natural gas డి) Condensed Natural gas 4. కిందివాటిలో శుద్ధమైన కార్బన్‌ ఏది? ఎ) కోల్‌  బి) చార్‌కోల్‌ సి) కార్బన్‌  డి) కోక్✔️‌ 5. సరిత: గాలి మరలను ఉపయోగించి విద్యుత్‌ తయారు చేయలేం. సంగీత: కోల్‌తార్‌ నుంచి నాఫ్తలిన్‌ లభిస్తుంది. ఎవరిది సరికాని వాక్యం ఎ) సంగీత  బి) సరిత✔️ సి) సంగీత, సరిత  డి) ఏదీకాదు 6. భావన (ఎ): కోల్‌, పెట్రోల్‌ను తరిగిపోయే ఇంధన వనరులు అని పిలుస్తారు. కారణం (ఆర్‌): ఇవి తక్కువ పరిమాణంలో ఉన్నాయి. వీటిని త్వరగా ఉత్పత్తి చేయలేం ఎ) ‘ఎ’ సత్యం, ఆర్‌ సత్యం, ఆర్‌ ‘ఎ’కి సరైన వివరణ✔️ బి) ‘ఎ’ సత్యం, ఆర్‌ సత్యం, ఆర్‌ ‘ఎ’ కి సరైన వివరణ కాద...

భారత్‌లో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం ఏది?

Image
జాగ్రఫీ 1. భారత్‌లో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం ఏది? ఎ) గిర్‌ నేషనల్‌ పార్కు బి) బందీపూర్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సి) నాగార్జున, శ్రీశైలం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం డి) దండకారణ్యం 2. కిందివాటిలో సరికానిది ఏది? ఎ) ఏనుగులకు సంబంధించిన ప్రాజెక్టు (ప్రాజెక్టు ఎలిఫెంట్‌)ను 1992లో ప్రారంభించారు బి) ప్రాజెక్టు ఎలిఫెంట్‌ ప్రకారం, ఏనుగులు ఉండే ప్రాంతాన్ని గ్రీన్‌, ఎల్లో, రెడ్‌ అని మూడు ప్రాంతాలుగా విభజించారు సి) భారతదేశంలో అతి వేగంగా అంతరించిపోతున్న తాబేళ్ల జాతి ఆలివ్‌ రిడ్లే తాబేళ్ళు డి) ఆపరేషన్‌ కార్బెట్‌ సీ టర్టిల్‌ అనే కార్యక్రమాన్ని 1975లో ప్రారంభించారు 3. కిందివాటిని జతపరచండి? 1) సిమ్లిపాల్‌ ఎ) ఉత్తరప్రదేశ్‌ 2) బందీపూర్‌ బి) ఒడిశా 3) మానస్‌ సి) కర్ణాటక 4) చంద్రప్రభ డి) అసోం ఎ) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి బి) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ సి) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ డి) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి 4. భారతేదశంలో మొట్టమొదటి టైగర్‌ ప్రాజెక్ట్‌ ఎక్కడ ప్రారంభించారు? ఎ) చంద్రప్రభ నేషనల్‌ పార్క్‌లో బి) జిమ్‌కార్బెట్‌ నేషనల్‌ పార్క్‌లో సి) కజిరంగా నేషనల్‌ పార్క్‌లో డి) ఘనా పక్షి సంరక్షణ కేంద్రంలో 5. ...

పింక్ & GB వాట్సాప్_వాడుతున్నారా ?ఐతే మీరు డేంజర్ లో ఉన్నారు..

Image
#పింక్_వాట్సాప్_వాడుతున్నారా...?   వాట్సాప్‌ ఏం రంగులో ఉంటుంది అంటే... ఆకుపచ్చ రంగులో ఠక్కున సమాధానం వచ్చేస్తుంది.  అయితే కొన్నిసార్లు కొత్త రంగులో వాట్సాప్‌ వస్తోంది, వచ్చేసింది అంటూ కొన్ని లింక్‌లు కనిపిస్తూ ఉంటాయి. అవి నిజం కావు, వాట్సాప్‌కి వాటికీ సంబంధం లేదని గతంలో చాలామంది టెక్‌ నిపుణులు హెచ్చరించారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే... మరో ఫేక్‌ లింక్‌ ఇప్పుడు వాట్సాప్‌లో వైరల్‌ అవుతోంది కాబట్టి.. ఫేక్‌ వాట్సాప్‌  లింక్‌లు మీకు కూడా గతంలో వచ్చుంటాయి. వాటిని క్లిక్‌ చేసి కొంతమంది ఇబ్బందులు పడి ఉంటారు. అలాంటి ఓ లింక్‌ ఇప్పుడు మళ్లీ కనిపిస్తోంది. ‘పింక్‌ వాట్సాప్‌’ (Pink Whatsapp) అంటూ  ఓ లింక్‌ ఈ రోజు ఉదయం నుంచి వైరల్‌ అవుతోంది. అది అచ్చంగా వాట్సాప్‌ లింక్‌లానే ఉంటుంది  కానీ, వాట్సాప్‌కీ, దీనికీ సంబంధం ఏమీ  ఉండదు. ఆ లింక్‌ను క్లిక్‌ చేస్తే మీ సమాచారం మొత్తం అగంతుకుల చేతికి చేరిపోతుంది.   ఇది క్లిక్‌ చేస్తే వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు మీకు అందుబాటులోకి వస్తాయని కూడా రాశారు. మీకు కూడా అలాంటి లింక్‌ వచ్చి ఉంటే పొరపాటున కూడా క్లిక్‌ చేయొద...

SBIలో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండా.. నిరుద్యోగులకు అలర్ట్..

Image
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల కోసం ఖాళీలను ప్రకటించింది. మొత్తం 65 పోస్టులకు ఈ రిక్రూట్‌మెంట్ జరుగుతుంది . అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ sbi.co.in సందర్శించి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు(Application) చేసుకోవాల్సి ఉంటుంది.  ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 12. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ sbi.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.  మొత్తం పోస్టుల సంఖ్య 65. దీనిలో విభాగాల వారీగా ఇలా ఉన్నాయి. మేనేజర్ - 64 పోస్టులు, బోర్డు సలహాదారు - 1 పోస్ట్ ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే.. BE/B.Tech , MBA చేసి ఉండాలి.  Board Advisor పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు IG ర్యాంక్ నుండి పదవీ విరమణ చేసి ఉండాలి . అంతే కాకుండా.. CAPFలో కనీసం 3 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.    దరఖాస్తు ఫీజు.. జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.750. SC/ST/PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. బ్య...

ఇంటర్మీడియట్ తో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌లో భారీగా ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

Image
భారత వైమానిక దళంలో ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి అద్భుత అవకాశం. వాయుసేనలో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీకి ఎయిర్‌ఫోర్స్ కామ‌న్ అడ్మిష‌న్ ఆన్‌లైన్ టెస్ట్-01/2023 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు అవివాహితులైన పురుషులతోపాటు, మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ, మెటియోరాలజీ ఎంట్రీకి ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్‌, నాన్-టెక్నికల్) బ్రాంచుల్లో కలిపి మొత్తం 258 కమీషన్డ్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. వీటిల్లో ఫయింగ్‌లో 10 (పురుషులకు 5, మహిళలకు 5), గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)లో 130, గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్)లో 118 పోస్టులు ఉన్నాయి. ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌, వెపన్‌ సిస్టమ్‌, అడ్మినిస్ట్రేషన్‌, ఎల్‌జీఎస్‌, అకౌంట్స్‌, ఎడ్యుకేషన్‌, మెటియోరాల‌జీ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ కింది అర్హతలుండాలి. ఫ్లయింగ్‌ బ్రాంచ్‌ పోస్టులకు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో చదివి ఉండాలి. సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ లేదా బీఈ/బీటెక్‌ పూర్తి...

శాతవాహనుల చరిత్ర , శ్రీముఖుడు నుండి పులోమావి-3 వరకు

Image
శాతవాహనుల చరిత్ర 1) శ్రీముఖుడు 2) కృష్ణ 3) శాతకర్ణి-1 4) వేదశ్రీ 5) శాతకర్ణి-2 6)కుంతల శాతకర్ణి 7) పులోమావి-1 8) హాలుడు 9)గౌతమీ పుత్ర శాతకర్ణి 10)వశిష్ట పుత్ర పులోమావి/ పులోమావి-2 11)వశిష్ట పుత్ర శివ శ్రీ 12)యజ్ఞశ్రీ 14)విజయశ్రీ 15)చంద్రశ్రీ  16)పులోమావి-3 శ్రీముఖుడు ఇతనికి రాయ అనే బిరుదు కలదు. ఈ బిరుదును మొగల్ చక్రవర్తి అయిన అశోకుడు ఇచ్చాడు. అలాగే రాయసిముఖ శాతవాహన అనే బిరుదు కూడా ఉందని కోటిలింగాలలో దొరికిన నాణెముల ద్వారా తెలుస్తుంది.  ఈయన కాలానికి చెందిన నాణెములు కోటిలింగాల వద్ద దొరికాయి.  ఈయన గోదావరి సమీపంలో కోటిలింగాల వద్ద రాయపట్నం అనే పట్టణాన్ని నిర్మించాడు.  ఈ యొక్క గురువు కాలకచూరి ఈయన జైన మత గురువు.  శ్రీముఖిుడి యొక్క రాజధాని కోటిలింగాలలో కలదు, రెండవ రాజధాని ప్రతిష్టానపురం లో ఉండేది.  ఈయన మహారాష్ట్రలో నాగ జాతికి చెందిన త్రైనకైరో అనే రాజును ఓడించి, అతని కుమార్తె అయిన నాగానికకు శాతకర్ణి-1 కు ఇచ్చి వివాహం జరిపించాడు.  శాతకర్ణి-1 శ్రీముఖి యొక్క కొడుకు. అయితే శ్రీముఖుడు ఫస్టు జైన మతాన్ని తర్వాత వైదిక మతాన్ని స్వీకరించాడు.  కృష్ణ ఈయన న...

శాతవాహనుల అనంతరము దక్షిణ తెలంగాణ

Image
శాతవాహనుల అనంతరము దక్షిణ తెలంగాణ మరియు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలను పాలించిన అతి ముఖ్యమైన వంశం ఇక్ష్వాకులు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, కృష్ణా, ప్రకాశం,కర్నూలు మరియు తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలు వీరి రాజ్యంలో అంతర్భాగాలుగా ఉండేవి. సింహం వీరి రాజ చిహ్నం. 1ఇక్ష్వాకులు శాతవాహనులకు సామంతులు అని  తెలియజేయు శాసనం ఏది?    1) రెంటాల శాసనం 2) జగ్గయ్యపేట శాసనం  3) అల్లూరి శాసనం 4) దాచేపల్లి శాసనం జవాబు:3 2 ఇక్ష్వాకు అనే పదానికి అర్థం?   1) కాకర    2) చెరకు 3) సింహం  4) పులి     జవాబు:2 3  ఇక్ష్వాకుల వంశస్థాపకుడు ఎవరు?    1) శ్రీ వీరపురుషదత్తుడు    2) ఎహువుల శాంతమూలుడు   3) రుద్రపురుషదత్తుడు   4) శ్రీ శాంతమూలుడు   జవాబు:4 4  .క్రింది వాఖ్యాలలో సరైన వాఖ్యాన్ని గుర్తించండి.     1) విష్ణుపురాణం ప్రకారం ఇక్ష్వాకులు దక్షిణ భారతదేశానికి చెందినవారు      2) ఇక్ష్వాకులు చెంచుజాతికి చెందినవారని డా॥ ఆర్.జి...